24, ఫిబ్రవరి 2016, బుధవారం

jnu desabhakti

దేశభక్తి అనే మాట పైకి వినిపిస్తున్నది కాని సంఘపరివార్‌ కోరుకుంటున్నది హిందూభక్తి. అందుకే జాతీయత, జాతీయవాదం అనే పదాల మధ్య హిందుత్వను తూలనాడితే తాట తీస్తాం అని అసలు మాట చెప్పేస్తున్నారు. జేఎన్‌యూను హిందుత్వ విశ్వవిద్యాలయం చేయాలనే ఎజెండా వాళ్లకు ఉన్నది. 

జే‌ఎన్‌యూలో దేశద్రోహులు తయారయ్యారు.. నాలుగు నెలలపాటు మూసెయ్యాలి... తాము దేశభక్తలమనే అఫిడవిట్‌ ఇచ్చినవాళ్లకే యూనివర్సిటీలో సీటు ఇవ్వాలని బీజేపీ నాయకుడు సుబ్రహ్మణ్యస్వామి అన్నారు. హైదరాబాదు సెంట్రల్‌ యూనివర్సిటీలో, జేఎన్‌యూలో జరిగిన, జరుగుతున్న పరిణామాల వెనుక ఉన్న సంఘపరివార్‌ అసలు ఉద్దేశాన్ని ఆయన చాలా బాహాటంగా ప్రకటించారు. 
                  ఏ మాత్రం దాపరికం లేకుండా హిందుత్వ శక్తులు సామాజిక రంగాలన్నిటినీ, ముఖ్యంగా సృజనాత్మక, మేధో రంగాలన్నిటినీ దురాక్రమించాలనుకుంటున్నాయి. సుబ్రహ్మణ్యస్వామి చెప్పలేదుగాని ఆయన మాటల్లోని అంతరార్థమేమంటే.. ఇక నుంచి జాతీయత, దేశభక్తి అంటే ఏమిటో సంఘపరివార్‌ పెట్టే పరీక్షలో క్వాలిఫై అయిన వారికే యూనివర్సిటీల్లో సీటు ఇస్తారు. విద్యార్థులకే కాదు, అధ్యాపకులకు కూడా. పెద్ద పెద్ద డిగ్రీలు తీసుకున్నంత మాత్రాన ప్రొఫెసర్‌ ఉద్యోగాలు వస్తాయని భ్రమపడటానికి లేదు. సంఘపరివార్‌ దగ్గర ఉన్న జాతీయవాదం అనే సిలబ్‌సలో పరీక్ష రాసి పాసవ్వాలి. కాశ్మీర్‌ మీద నీ వైఖరి ఏమిటి అనే అతి ముఖ్యమైన ప్రశ్న అందులో ఉంటుంది. దానికి అక్షరం పొల్లుపోకుండా బీజేపీ చెప్పే పాఠాన్ని వల్లెవేయాలి. లేకపోతే ప్రొ. గిలానీ లాంటి వాళ్లు యూనివర్సిటీల్లో జొరబడకుండా అడ్డుకోలేం. ఇదీ ఆయన మాటల అసలు అర్థం. దేశభక్తి లేని వారి వల్లే జేఎన్‌యూ ప్రతిష్ట దెబ్బతింటోందని బీజేపీ ఎంపీ ఉదిత్‌రాజ్‌ కూడా అన్నారు.
దేశభక్తి అనే మాట పైకి వినిపిస్తున్నది కాని వాళ్లు కోరుకుంటున్నది హిందూభక్తి. హిందూ మతం పట్ల దేశ ప్రజానీకమంతా భక్తి ప్రపత్తులతో కైమోడ్చి ఉండాలి. వాళ్లు చెబుతున్న హిందుత్వ పట్ల అందరం విధేయంగా పడి ఉండాలి.
                అందుకే హిందుత్వను తూలనాడితే తాట తీస్తాం అని జాతీయత, జాతీయవాదం అనే పదాల మధ్య అసలు మాట చెప్పేస్తున్నారు. జేఎన్‌యూను హిందుత్వ విశ్వవిద్యాలయం చేయాలనే ఎజెండా వాళ్లకు ఉన్నది. దాని కోసమే ఇదంతా. సెంట్రల్‌ యూనివర్సిటీలో ముజఫర్‌ నగర్‌, మెమన్‌ వివాదాస్పదమైతే, జేఎన్‌యూలో అఫ్జల్‌గురు, కాశ్మీర్‌ వివాదాలుగా మారాయి. ఒక రకంగా హైదరాబాదు యూనివర్సిటీలో సంఘపరివార్‌ ఎంత తప్పుడు ప్రచారం చేసినా రోహిత్‌ ఆత్మహత్యపై ప్రపంచవ్యాప్తంగా ప్రతిస్పందన వచ్చింది. ఆ మేరకు ఏబీవీపీ అన్‌ పాపులర్‌ అయింది. అయినా అది వెనక్కి తగ్గకుండా జేఎన్‌యూలో అంతకంటే తీవ్రస్థాయిలో దాడులకు పాల్పడింది. రోహిత్‌ విషయంలో చేసిన వాదనలకంటే అత్యంత ప్రమాదకర వాదనలు తెచ్చింది. ఇంకోపక్క నుంచి బీజేపీ నాయకులు, మంత్రులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు.
ఇక నుంచి నలుగురు గుమికూడిన ప్రతిచోటా సంఘపరివార్‌ కార్యకర్తలు దూరిపోయి పాకిస్థాన్‌ జిందాబాద్‌ అని నినాదాలు ఇచ్చేస్తారు. దీంతో అక్కడ ఉన్న వాళ్లంతా తమ పవిత్ర దేశభక్తిని చాటుకోవాల్సిన దుస్థితిలో పడిపోతారు. అందుకని నిత్యం అప్రమత్తంగా ఉంటూ సంఘపరివార్‌ జాతీయవాదాన్ని బట్టీయం పట్టాలి. అంత మాత్రమేకాదు, దాన్ని ఆచరిస్తూ పోవాలి. లేకపోతే ఏ బలవత్తర క్షణానైనా దేశద్రోహులనే ముద్ర మోయాల్సి వస్తుంది. మా దేహం ముక్కలైనా ఈ దేశాన్ని ముక్కలు కానివ్వమని ఇల్లు ఎగిరేలా అరుస్తూ సంఘపరివార్‌ జాతీయవాదాన్ని వ్యతిరేకించడం అయ్యేపని కాదు. అప్పుడు సంఘపరివార్‌ ‘దేశభక్తి’, మీ దేశభక్తీ ఒకటే అవుతాయి.
మన దేశభక్తిని కాశ్మీర్‌ సున్నితపు త్రాసులో తూచేస్తుంది. భక్తికి ఎన్ని మార్గాలు, నిర్వచనాలు ఉన్నాయో మన దేశంలో దేశభక్తికి అంతకంటే ఎక్కువ ఉన్నాయి. అవన్నీ ‘జాతీయోద్యమం’ నుంచి పుట్టుకొచ్చాయి. అందుకే ఈ దేశంలో ముస్లిం అస్తిత్వమని అన్నా, ముస్లింల హక్కుల పక్షాన నిలబడినా దేశభక్తి జ్వాలలకు దహనం కావాల్సిందే. ఇప్పుడు గురజాడ బతికి ఉంటే దేశమంటే మట్టి కాదు మనుషులు అన్నందుకు సెడిషన్‌ కేసు తప్పక పెట్టేవారే. వాస్తవానికి వాళ్ల అర్థంలో దేశమంటే హిందుత్వ. జాతీయత అంటే హిందూ జాతీయత. రెండో మాట మాట్లాడితే దేశద్రోహమే.
బీజేపీ పాలన అతి కొద్ది కాలంలోనే చేరవలసిన తీరమే చేరింది. అది కాశ్మీర్‌ ‘వివాదం’. దీనికి నేపథ్యంలో ఉరిశిక్షల సమీక్ష సాగుతున్నది. అసాధారణ కేసుల్లోనే ఉరిశిక్ష అమలు చేయాలనే వాదన వినిపిస్తోంది. చూడ్డానికి ఇది ఎంత బాగుంది! అయితే ఏమిటా అసాధారణం? రాజ్యాన్ని ధిక్కరించే చర్యలు... ‘ఉగ్రవాద చర్యలు’. ఈ దేశ పౌరులైనందుకు భారత రాజ్యం ముస్లింలకు శాశ్వత ప్రత్యేక కానుకగా ఉరిశిక్ష ఇవ్వబోతున్నది. భారత శిక్షాస్మృతి ఉరిశిక్షను ముస్లింలకు కేటాయించనుంది. ఏ చర్య రాజ్య వ్యతిరేకం? ఎవరు ఉగ్రవాది? అనేది బైటికి చర్చింకపోవచ్చుగాని ఎన్నడో నిర్ధారణ అయిపోయింది. ముస్లింలు చేసే పనులన్నీ అలాంటి జాబితా కిందికి వస్తాయి. ముస్లింలందరూ ఉగ్రవాదులవుతారు. ఈ కానుక ఎప్పుడు ఎవరి మెడను అలంకరిస్తుందో చెప్పలేం. అంతే.

హైదరాబాదు యూనివర్సిటీలో మెమన్‌, జేఎన్‌యూలో అఫ్జల్‌గురు వివాద చర్చా సందర్భాలు ఈ విషయాన్నే చెబుతున్నాయి. కాకపోతే రాజ్య వ్యతిరేకుల, దేశద్రోహుల జాబితాలోకి ముస్లిం తర్వాత మావోయిస్టులు వస్తారు. జేఎన్‌యూలో జరిగిన సభలో దేశవ్యతిరేక నినాదాలు ఏఐఎ్‌సఎఫ్‌ విద్యార్థులు ఇచ్చి ఉండకపోవచ్చు.. మావోయిస్టు అనుబంధ విద్యార్థులు ఇచ్చారనే వదంతి మొదలైంది. ఇందులో ‘దేశద్రోహాన్ని’ గుర్తించే ప్రయత్నం ఉన్నది. చివరికి ఇప్పుడు ఒకటే మిగిలింది. సంఘపరివార్‌ చేతిలో దేశద్రోహ ముద్ర వేయించుకొని.. అబ్బే.. మేం దేశద్రోహులం కాదు. అసలు మా అంత దేశభక్తులు ఎవరున్నారు? అని వాళ్లు చెప్పే దేశభక్తి గొంతుతోనే మాట్లాడటమా? లేక మేం అసలు సిసలైన దేశద్రోహులమనే వాదన వినిపించడమా? ఎందుకంటే ఇప్పుడు దేశభక్తి అంటే సంఘపరివార్‌ హిందూ జాతీయవాదం తప్ప మరేమీ లేదు. అదే రామభక్తి, అదే దేశభక్త
వలస వ్యతిరేక కాలంనాటి దేశభక్తిలో ఉండిన ‘మంచి’ ఇప్పుడు శతాంశం కూడా లేదు. ఈ రోజుల్లో దేశభక్తి గురించి మాట్లాడటమంటే సంఘపరివార్‌ మాటలు వల్లించడమే. వాళ్ల పరీక్షలో పాసవ్వడానికి తాపత్రయపడటమే. ఎందుకంటే సంఘపరివార్‌ దేశభక్తి గురించి గగ్గోలు పెడుతోంది కాని ప్రజాస్వామ్యమనే మాట పొరబాటున కూడా అనదు. పార్లమెంటరీ పరిధిలో ప్రజాస్వామ్యం గురించి మాట్లాడినా కొరివితో తలగోక్కున్నట్ల్లవుతుంది. ఆ గోలంతా ఎందుకు? చక్కగా దేశభక్తి అనే రామాస్త్రం ఉండగా. జాతీయత ఉండగా... ఇదీ వాళ్ల వరస. వాళ్లకు ఈ స్పష్టత ఉండటం పరోక్షంగా మేలు చేస్తుంది. దేనికంటే వలస వ్యతిరేక కాలంనాటి ధిక్కారాలను దేశభక్తిలోని ‘రాజ’మార్గం నుంచి తప్పించి ప్రజాస్వామిక సంప్రదాయాలుగా గుర్తించాలి. మేము వాటి వారసులమని ప్రజాస్వామిక లౌకిక విప్లవ శక్తులు సగర్వంగా చెప్పుకోవాలి. అప్పుడు మేమే అసలైన దేశభక్తులమని వాదించే దుస్థితి తప్పుతుంది. ప్రజాస్వామ్యం లేని దేశభక్తి అంటే ఫాసిజమే. ప్రజాస్వామ్య విలువలు, సంస్కృతి, జాతుల వికాసం గీటురాయిగాగల దేశద్రోహం వర్థిల్లాలి అని నినాదం ఇవ్వడం ఎంత బాగుంటుంది?


jnu incident andrajyothi artical.aginest left partys

జవహర్‌లాల్‌ నెహ్రూ విశ్వవిద్యాలయంలోని వామపక్ష విద్యార్థి సంఘాలకు పలు అంతర్గత, బహిరంగ జాతి వ్యతిరేక శక్తులు సహాయ సహకారాలను అందిస్తున్నాయని ఒక ఆరోపణ. దీనిని భారత దేశం పట్ల అంతర్జాతీయ కుట్రలో భాగంగానే అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది.

దేశంలోని ప్రతిష్టాత్మక జవహర్‌ లాల్‌ నెహ్రు విశ్వవిద్యాలయం గత పక్షంరోజులుగా రాజకీయ నాయకులకు, మీడియా మిత్రులకు, స్వచ్ఛంద సంస్థలకు, సాధారణ ప్రజానీకానికి ప్రధాన చర్చనీయాంశం. ఇందుకు కారణం అందరికీ వారివారి పద్ధతులలో తెలిసినదే. ఒకరు భారత రాజ్యాంగం ప్రసాదించిన భావ ప్రకటనా స్వేచ్ఛను భారత కేంద్ర ప్రభుత్వం హరిస్తుందని వాదిస్తుంటే... దేశ వ్యతిరేక చర్యలు సహించేది లేదని మరొకరు. ఇంతకీ జేఎనయూలో ఏమి జరిగింది? ఎందుకు ఇంత పెద్ద చర్చకు దారితీసింది అనేది మౌలిక ప్రశ్న? 
               ఉమర్‌ ఖలీద్‌ (జేఎనయూలో పీహెచడీ విద్యార్ధి), అతని మిత్రులు కలిసి ఫిబ్రవరి 9 సాయంత్రానికి సాంస్కృతిక పండుగ ‘‘కల్చరల్‌ ఫెస్టివల్‌’’ పేరుతో విశ్వవిద్యాలయ అధికారుల నుంచి అనుమతి పొంది తమ కార్యక్రమానికి సిద్ధమైన తరుణంలో జేఎనయూఎ్‌సయూ సంయుక్త కార్యదర్శి సౌరబ్‌ కుమార్‌ శర్మ కల్చరల్‌ ఫెస్టివల్‌ పేరుతో దేశ వ్యతిరేక కార్యక్రమాలకు పన్నాగం పన్నారని, వారి కార్యక్రమ అనుమతిని రద్దు చేయమని లిఖిత పూర్వకంగా కోరడంతో విశ్వవిద్యాలయ అధికారులు తమ అనుమతిని వెనక్కి తీసుకున్నారు. అయినప్పటికీ ఆ విద్యార్థులు విశ్వవిద్యాలయ అధికారులను సవాలు చేస్తూ తమ కార్యక్రమాన్ని నిర్వహించారు. యూనివర్సిటీ అధికార యంత్రాంగం ఆ కార్యక్రమాన్ని వీడియో తీసింది. అందులో ఉమర్‌ ఖలీద్‌ అతని అనుచర గణం సబర్మతి హాస్టల్‌ ముందు దేశ వ్యతిరేక నినాదాలు చేయడం ద్వారా జేఎనయూ దేశ ప్రజలను ఆకర్షించింది. జేఎనయూఎ్‌సయూ అధ్యక్షుడు కన్నయ్య కుమార్‌ అదే సమయంలో ఉమర్‌ ఖలీద్‌ ప్రక్కన.... ‘ఆజాదీ’ అని నినాదాలిస్తూ వీడియోకు పట్టుపడడంతో ఉమర్‌ ఖలీద్‌తో సహా కన్నయ్య కుమార్‌, డి.అర్పిత (డి.రాజా కూతురు), మరో ఐదు మందిపై దేశ ద్రోహ చట్టం కింద ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేసారు. అందులో కన్నయ్య కుమార్‌ పోలీసుల చేతికి చిక్కగా మిగిలిన వారు పరారీలో ఉన్నారు. కన్నయ్య కుమార్‌ తన కేసును తనే వాదించుకుంటూ ఆజాదీ కావాలని నినదించింది పేదరికానికి వ్యతిరేకంగా, నిరక్షరాస్యతకు వ్యతిరేకంగా అని సమర్థించుకొన్నాడు.
                       కానీ దీనికంటే ముందుగా గత రెండు దశాబ్దాలుగా బీఎ్‌సఎఫ్‌ జవాన్లకు, సీఆర్పీఎఫ్‌ జవాన్లకు వ్యతిరేకంగా, తీవ్రవాదులకు మద్దతుగా, నక్సల్‌ వాదులకు మద్దతుగా కాశ్మీర్‌ లిబరేషన్‌ పేరుతో, స్వేచ్ఛ పేరుతో ఎన్నో సెమినార్లు, వర్క్‌ షాప్‌లు, డిస్కషన్లు నిర్వహిస్తున్నారు. డీఎ్‌సయూ (డెమోక్రటిక్‌ స్టూడెంట్స్‌ యూనియన) తన కరపత్రంలో బీఎ్‌సఎఫ్‌ జవాన్లను ఉద్దేశిస్తూ ‘ఇండియన్‌ డాగ్స్‌... గో బ్యాక్‌’ అంటూ రాయడం జరిగింది. అంతేకాదు ఏఐఎస్‌ఏ అనే విద్యార్ధి సంఘం జేఎనయూ లైబ్రరీ గోడపై ‘ఫ్రీడమ్‌ ఫర్‌ కాశ్మీర్‌, నాగాలాండ్‌, మణిపూర్‌, అస్సాం, పాలస్తీనా’ అని రాయడం జరిగింది. ఇంత బహిరంగంగా దేశ వ్యతిరేక కార్యక్రమాల నిర్వహణకు కావలసిన శక్తి జేఎనయూ వామపక్ష విద్యార్థి సంఘాలకు ఫిబ్రవరి 9 అఫ్జల్‌ గురు ఉరితీత ద్వారానే రాలేదు. గత కొన్ని సంవత్సరాలుగా స్వేచ్ఛ, స్వాతంత్య్రం పేరుతో పేదరికం, మహిళా సాధికారత ముసుగున జేఎనయూలో చేసే చర్చల ద్వారానే, ఫ్రీడమ్‌ ఆఫ్‌ స్పీచ్‌, ఫ్రీడమ్‌ ఆఫ్‌ ఎక్స్‌ప్రెషన్‌ పేరున సమకూరిందనేది కాదనలేని సత్యం. అందుకు ఎన్నో అంతర్గత, బహిరంగ జాతి వ్యతిరేక శక్తులు సహాయ సహకారాలను అందిస్తున్నాయని ఒక ఆరోపణ. కాబట్టి దీనిని భారత దేశం పట్ల అంతర్జాతీయ కుట్రలో భాగంగానే అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది.
               విశేషమేమిటంటే ఈ విషయం జేఎన్‌యూ వాతావరణానికి ఎంతమాత్రం కొత్త కాదు. ఏబీవీపీ ఈ కార్యక్రమాన్ని గతం నుంచి వ్యతిరేకిస్తోంది. కానీ ఈ సారి వారు సౌరబ్‌ కుమార్‌ శర్మ, అతని ఏబీవీపీ మిత్రులపై దాడి చేసిన సన్నివేశాలు, జాతి వ్యతిరేక నినాదాలతో కూడిన కార్యక్రామాన్ని వీడియో తీయడంతో వామపక్ష విద్యార్థి సంస్థల బండారం యావత్‌ భారతానికి తెలిసింది. దేశ వ్యతిరేక నినాదాలతో కూడిన ఆ వీడియో మీడియా చేతికి అందడంతో జేఎనయూ ప్రతిష్ట మసకబారింది.
            ‘పాకిస్థాన్‌ జిందాబాద్‌.... ఇండియా ముర్దాబాద్‌’ / ‘భారత్‌ కి బర్బాతి తక్‌... జంగ్‌ రహేంగే జంగ్‌ రహేంగే’ (భారత దేశాన్ని ముక్కలు అయ్యేంత వరకు పోరాడుతాం... పోరాడుతాం) / ‘భారత్‌ కో హజార్‌ తుక్డా కరో.... ఇన్ష అల్లాహ్‌ ఇన్ష అల్లాహ్‌’ (భారత్‌ను వెయ్యి ముక్కలు చేయి... అల్లాహ్‌ ఆశీర్వాదం ఉంటుంది) / ‘కిత్న అఫ్జల్‌ కో మరోన్గే.... ఉత్న అఫ్జాల్‌ నికలేగా’ (ఎంత మంది అఫ్జల్‌ గురులను చంపితే అంతమంది అఫ్జల్‌లు పుడతారు) / ‘కిత్న అఫ్జల్‌ కో మరోన్గే.... హర్‌ ఘర్‌ సే అఫ్జల్‌ నికలేగా’ (ఎంత మంది అఫ్జల్‌ గురులను చంపుతావు.. ప్రతి ఇంటినుంచి అఫ్జల్‌లు పుడతారు) / ‘కాశ్మీర్‌ కో ఆజాద్‌ దో.... భారత్‌ కో బర్బాత్‌ కరో’ / ‘హం మాంగే ఆజాద్‌... కేరళ్‌ కో’ (కేరళకు ప్రత్యేక దేశంగా స్వాతంత్య్రం కోరుతాం) / ‘హం మాంగే ఆజాద్‌.... బంగాల్‌ కో’ (బెంగాల్‌కు ప్రత్యేక దేశంగా స్వాతంత్య్రం కోరుతాం) / ‘హం మాంగే ఆజాద్‌... అస్సాం కో’ (అస్సాంకు ప్రత్యేక దేశంగా స్వాతంత్య్రం కోరుతాం)...ఇలా కొనసాగాయి వారి జాతి వ్యతిరేక నినాదాలు. సాధారణ జేఎనయూ విద్యార్థులకు ఇవి ప్రతి సంవత్సరంలా షరా మాములే. తిరిగి ప్రశ్నించలేని పరిస్థితి. ఎందుకంటే ప్రశ్నిస్తే ఆర్‌ఎ్‌సఎస్‌, ఏబీవీపీ అని ముద్ర వేసి పరీక్షలలో ఫెయిల్‌ చేస్తారనే భయం.
              ఇంత జరిగినా యూనివర్సిటీ అధికారుల చర్యలతో సద్దుమణుగుతుందనుకున్న ఈ విషయం రాహుల్‌ గాంధీ, డి.రాజా గార్ల పరామర్శతో ఒక్కసారిగా యూనివర్సిటీ వాతావరణం వేడెక్కింది. రాజకీయ నాయకుల ప్రధాన చర్చలకు దారితీసింది. డి.రాజా గారు పాపం తన కుమార్తెను దేశద్రోహ చట్టం నుంచి రక్షించుకోవాలనే తాపత్రయంతో యూనివర్సిటీని సందర్శించగా... రాహుల్‌ గాంధీ కేంద్ర ప్రభుత్వ చర్యలను విమర్శించి విద్యార్థుల మన్నన పొందాలనే ప్రయత్నంతో అభాసు పాలయ్యారు.
                 వాద ప్రతివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. చర్యకు ప్రతి చర్యలు జరుగుతూనే ఉన్నాయి. విశ్వవిద్యాలయానికి వ్యతిరేకంగా ఎన్నోసంస్థలు జేఎనయూ నుంచి దేశ ద్రోహులను తరిమేయాలని వర్సిటీ ప్రధాన ద్వారం ముందు గత పది రోజులుగా నిరసన వ్యక్తం చేస్తూనే ఉన్నాయి. మొదటిసారిగా కమ్యూనిస్టు భావజాలాన్ని సాధారణ ప్రజానీకం సైతం ప్రశ్నించడం ప్రారంభించింది ఇలా...
(1) కన్నయ్య కుమార్‌కు మద్దతుగా నిలిచిన వామపక్ష భావజాల రాజకీయ నాయకులు, అధ్యాపకులు అదే స్థాయిలో దేశద్రోహకర నినాదాలు చేసిన విద్యార్థులను శిక్షించాలని ఎందుకు ప్రశ్నించడం లేదు? (2) దంతేవాడలో నక్షలైట్ల చేతిలో చనిపోయిన 70 మంది పోలీసులకు శ్రద్ధాంజలి ఘటించాల్సింది పోయి జేఎనయూలో వామపక్ష విద్యార్ధి సంఘాలు ఎందుకు సంబరాలు చేసుకున్నారు? (3) నిరంతరం మహిళా స్వాతంత్య్రం గురించి మాట్లాడే కమ్యూనిస్టులు బంగ్లాదేశీ మైనార్టీ (హిందూ) యువతిపై ఒక పైశాచిక అధ్యాపకుడు అర్షద్‌ ఆలం అత్యాచారం చేసి పట్టుపడడంతో యూనివర్సిటీ అధికారులు అతనిని విధుల నుంచి సస్పెండ్‌ చేశారు. దీనిపై కమ్యూనిస్టు భావజాల అధ్యాపకులు ప్రశ్నించలేదు సరికదా అతనికి మద్దతుగా ఎందుకు నిలిచారు? ప్రతి సంఘటనకు ఉద్యమం చేసే వామపక్షాలు అతనికి వ్యతిరేకంగా ఎందుకుమాట్లాడలేదు? 
(4) స్వేచ్ఛ, విముక్తి, బానిసత్వం, పేదరికం, అంటరానితనం, మూఢనమ్మకాలు పేరుతో వీరుచేసే ఉద్యమాల మాటున ఎందుకు దేశ వ్యతిరేక నినాదాలు ఉద్భవిస్తున్నాయి? వీటిని ఫ్రీడమ్‌ ఆఫ్‌ స్పీచ్‌ పేరుతో ఎందుకు సమర్థించుకుంటున్నారు? (5) ఫిబ్రవరి 9న సబర్మతి హాస్టల్‌ ముందు దేశ వ్యతిరేక నినాదాలు చేస్తూ వీడియోకి పట్టుబడిన వారికి బుద్ధి చెప్పాల్సింది పోయి, అదే వీడియోను ఎడిట్‌ చేసి ఆ నినాదాలు చేసింది ఏబీవీపీ విద్యార్థులు అని ప్రచారం చేసే అగత్యం వామపక్ష అధ్యాపకులకు ఎందుకు దాపురించింది? (6) రాజ్యాంగాన్ని సంరక్షిస్తూ, రాజ్యాంగ విలువలతో నడుచుకుంటున్న భారత అత్యున్నత న్యాయస్థానం భారత పార్లమెంటుపై దాడిచేసిన అఫ్జల్‌ గురుకు మరణ దండన విధిస్తే ఆ తీర్పును ఎందుకు ప్రశ్నిస్తున్నారు?
            పార్లమెంటుపై దాడిని ఎదిరిస్తూ మరణించిన వీర సైనికుల బలిదానాలను ఎందుకు అపహాస్యం చేస్తున్నారు? (7) వామపక్ష నాయకులకు, విద్యార్థులకు, అధ్యాపకులకు నిజంగానే రాజ్యాంగం పట్ల నమ్మకం ఉందా? లేక నటిస్తున్నారా? నిజంగానే నమ్మకం ఉంటే భారత అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీం కోర్టు తీర్పును ఎందుకు గౌరవించడం లేదు? (8) ప్రతి సంవత్సరం అఫ్జల్‌ గురు, యాకుబ్‌ మాలిక్‌ లాంటి దేశద్రోహులను స్మరించుకునేందుకు కారణాలు వెదికే వీరికి ఏ ఒక్క రోజైనా దేశం కోసం ప్రాణాలర్పించిన భారత జవాన్లను సంస్మరించుకునేందుకు కారణాలు ఎందుకు దొరకడం లేదు? (9) ఫిబ్రవరి 9న దేశ రక్షణ కోసం సియాచిన్‌ గ్లేసియర్‌ మంచు కొండల్లో మరణించిన లాల్‌ నాయక్‌ హనుమంతప్పకు యావత్‌ భారతం శ్రద్ధాంజలి ఘటిస్తుంటే.... జేఎనయూలో ఎందుకు అఫ్జల్‌ గురును స్మరిస్తున్నారు?
             జేఎన్ యూలో వెంటనే సాధారణ పరిస్థితులు నెలకొల్పాల్సిన కర్తవ్యం ప్రధానంగా అధ్యాపకులు, విద్యార్థులపై ఉంది. సంఘ విద్రోహ శక్తులను చట్టానికి అప్పగించి తిరిగి యూనివర్సిటీలో సాధారణ పరిస్థితులను నెలకొల్పి యువతను అధ్యయనం, పరిశోధన వైపు నడిపించాల్సిన ప్రధాన బాధ్యత జేఎనయూ అధ్యాపకులదే. యూనివర్సిటీ పాలక యంత్రాంగం వెంటనే స్పందించి రాజకీయ నాయకులను క్యాంపస్‌లోపలికి రాకుండా నిరోధించి విద్యార్థులను దేశ సమస్యలపై పరిశోధన చేసే మానవ వనరులుగా తీర్చిదిద్దాలి. భావి భారత పౌరులుగా తీర్చిదిద్దాలి.
డా. లింగమూర్తి 

ఆర్థిక, రాజకీయ విశ్లేషకులు, న్యూఢిల్లీ

23, ఫిబ్రవరి 2016, మంగళవారం

త నాలుగు వారాలుగా ఇద్దరి పేర్లు దేశమంతటా ధ్వనించాయి; ఇంకా ప్రతిధ్వనిస్తున్నాయి. దక్షిణాపథాన, దేశానికి రెండవ రాజధాని అయితే బావుంటుందని బి.ఆర్‌.అంబేద్కర్‌ అభిలషించిన హైదరాబాద్‌లో, ఆ మహామనిషిని ఆరాధిస్తూ, అభ్యసిస్తూ అర్థంతరంగా నిష్క్రమించిన రోహిత వేముల ఒకరు. హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీలో రోహిత వేములకు జరిగింది జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్సిటీలో జరగనిచ్చేది లేదంటూ దేశ రాజధానిలో నినదించి, దేశద్రోహం అభియోగంపై జైలుకెళ్లిన కన్నయ్య కుమార్‌ మరొకరు.
ఈ ఇద్దరి సామాజిక నేపథ్యంలో తేడా ఉంది. దళిత తల్లి కడుపునే పుట్టి, వడ్డెర కుటుంబంలో పెంపుడు అమ్మమ్మ అనాదరణ అనుభవిస్తూ పెరిగినవాడు రోహిత. మారుమూల బిహార్‌ గ్రామంలో, భూమి హార్లు అనే అగ్రకులంలో పుట్టి వామపక్ష చైతన్యం మధ్య పెరిగినవాడు కన్నయ్య. రాజకీయంగా, తాత్వికంగా ఇద్దరి మధ్యా సారూప్యాలు చాలా ఉన్నాయి. వామపక్ష భావజాలం ఇద్దరినీ ప్రభావితం చేసింది. ఇద్దరూ అంబేద్కర్‌వాదులు. మనువాద సంస్కృతి ప్రమాదాన్ని, శక్తివంచన లేకుండా దానిని వ్యతిరేకించాల్సిన అగత్యాన్ని ఇద్దరూ గుర్తించారు. అందుకే ఇద్దరూ అణచివేతను ఎదుర్కొన్నారు. గాయపడకుండా ప్రేమించడం సాధ్యంకాని సమాజంలో బతకడం ఎందుకంటూ రోహిత చుక్కల్లోకి ఎగిరిపోయాడు. ధిక్కారాన్నే ఆయుధంగా మలచుకున్న కన్నయ్య తిహార్‌ జైలులో ఏకాంతంలో ఆలోచనలకు పదును పెట్టుకుంటున్నాడు. ఏబీవీపీకి ఆ అండ ఉంది కాబట్టే దాని ఫిర్యాదు పర్యవసానంగా హెచ్‌సీయూలో రోహిత వేముల బృందాన్ని సంఘ బహిష్కారం చేశారు. ఆ అండ ఉంది కాబట్టి జేఎన్‌యూలో కన్నయ్యపై దేశద్రోహ అభియోగం మోపి జైలుకు పంపించారు. లేకపోతే, తన పార్టీకి అనుబంధంగా ఉన్న విద్యార్థి సంఘం ఫిర్యాదుపై మంచీ చెడు ఆలోచించకుండా ఒక కేంద్ర మంత్రి, హెచ్‌సీయూలో చెలరేగుతున్న ‘సంఘ వ్యతిరేక, జాతి వ్యతిరేక శక్తులపై చర్య తీసుకోవాలంటూ’ మానవ వనరుల మంత్రిత్వ శాఖకు రాస్తారా? జేఎన్‌యూ, హెచ్‌సీయూ వంటి ఉన్నత విద్యాలయాల్లో చోటుచేసుకుంటున్న పరిణామాలు అనుకోకుండా సంభవిస్తున్నవేమీ కావు. ఒకసారి చూడండి. హెచ్‌సీయూలో గొడవ, ‘ముజఫర్‌నగర్‌ బాకీ హై’ అనే డాక్యుమెంటరీ ప్రదర్శన దగ్గర మొదలైంది.
ఇటు హెచ్‌సీయూలోనూ, అటు జేఎన్‌యూలోనూ కూడా అఫ్జల్‌ గురు ఉరి ఉదంతంపై నిరసన ప్రదర్శనలు ఘర్షణను తారస్థాయికి తీసుకువెళ్లాయి. దేశ భక్తిని, జాతీయతను రంగంపైకి తెచ్చేందుకు ఈ నిరసనలను ఏబీవీపీ ఉపయోగించుకుంది. మరణశిక్షను ప్రాథమికంగా వ్యతిరేకించడం మాట అటుంచండి. అఫ్జల్‌ గురు, యాకూబ్‌ మెమన్‌లకు ఆ శిక్ష అమలు పరచడంలో న్యాయ ప్రక్రియ సవ్యంగా పూర్తి కాలేదని చాలామంది న్యాయ కోవిదులు భావిస్తున్నారు. తమ అభిప్రాయాలను వారు నిష్కర్షగా ప్రకటించారు. ఈ నేపథ్యంలో తలెత్తిన నిరసనలను ఏబీవీపీ జాతి వ్యతిరేక నిరసనలుగా చిత్రస్తున్నది. దానికి కేంద్ర ప్రభుత్వం అండ లభిస్తోంది.
అఫ్జల్‌ గురు ఉరిని తీవ్రంగా నిరసించిన పీడీఎఫ్‌తో కలిసి జమ్మూకాశ్మీర్‌లో ప్రభుత్వం ఏర్పాటు చేసిన బీజేపీ, దాని అనుబంధ సంస్థలు ఈ మాట అనడం ఏమిటన్న ప్రశ్నకు ఆ వైపు నుంచి ఎవరూ సమాధానం చెప్పరు. పంజాబ్‌లో భింద్రన్‌వాలా భజనను కిమ్మనకుండా భరిస్తున్న అకాలీదళ్‌తో అంటకాగుతున్న బీజేపీకి ఇవేమీ పట్టవు. అధికారం అన్నిటికన్నా ముఖ్యం. బీజేపీ మత ప్రాతి పదికన రాజకీయాలు నడుపుతున్నది అధికారం కోసమే. చరిత్రలో చూసినా, వర్తమానంలో చూసినా మతం కోసమే మతం నడక ఎన్నడూ లేదు. అధికారం కోసమే మతం నడక.
ఏ ఉన్నత విద్యాలయం మెట్లు ఎక్కని స్మృతి ఇరానీకి ప్రధాని నరేంద్రమోదీ ఏదో ఒకటి ఇవ్వాలి కాబట్టి మానవ వనరుల శాఖ ఇచ్చారని అనుకోవడం అమాయకత్వమే అవుతుంది. ఉన్న విద్యా సంస్థలపై, పరిశోధనాలయాలపై ఏ మాత్రం జంకూ గొంకూ లేకుండా కర్ర పెత్తనం చేసి హిందుత్వ ఎజెండా అమలుపరచడం స్మృతి ఇరానీ వంటి వారికే బాగా సాధ్యపడుతుంది. నరేంద్ర మోదీని, ఆయన ప్రభుత్వ విధానాలనూ విమర్శిస్తున్నారన్న కారణంగా అంబేద్కర్‌ పెరియార్‌ స్టడీ సర్కిల్‌ను ఒకచూపు చూడండని మద్రాస్‌ ఐఐటీ లాంటి సంస్థకు మరొకరు సరాసరి లేఖ రాయగలరా? హెచ్‌సీయూలో అంబేద్కర్‌ స్టూడెంట్స్‌ అసోసియేషన్‌ ‘సంఘ వ్యతిరేక, జాతి వ్యతిరేక’ కార్యకలాపాలపై చర్య ఎంతవరకూ వచ్చిందని ప్రశ్నిస్తూ వరుసగా అయిదు ఉత్తరాలు రాసే పట్టుదల మానవ వనరుల మంత్రిత్వ శాఖకు మరొకరి నాయకత్వంలో ఉంటుందా?
రోహత వేముల ఆత్మహత్య రేపిన దుమారంతర్వాత కూడా జేఎన్‌యూ పరిణామాలు చోటుచేసుకోవడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఇదే దారిలో నడిచినందువల్ల కలిగే నష్టాల కంటే లాభాలు ఎక్కువ ఉన్నాయని బీజేపీ భావిస్తుందనుకోవాలి. వాటిల్లో మొదటిది ఒక రకమైన భయానక వాతావరణాన్ని తీసుకురావడం; ప్రశ్నించేందుకు, ధిక్కరించేందుకు జనం భయపడే వాతావరణం. ఆ తర్వాత హిందుత్వ ఎజెండాను అమలుచేసే శక్తులకు పగ్గాలను పూర్తిగా వదిలేయడం. వారికి వారి కార్యక్రమాలకు మెజారిటీ హిందువుల మద్దతు కూడగట్టేందుకు ‘జాతీయత’ ‘దేశభక్తి’ అంశాలను ఉపయోగించడం. ఎలాంటి విమర్శలు ఎదురైనా ఈ బాటలో ముందుకు సాగాలని అధికారపక్షం నిర్ణయించినట్లు మీడియా వార్తా కథనాలు చెబుతూనే ఉన్నాయి. 
ఇక్కడ గమనించాల్సిన ముఖ్యమైన అంశం ఒకటుంది. ప్రధాని మోదీ జపిస్తున్న అభివృద్ధి మంత్రానికీ, మత ప్రాతిపదిక రాజకీయాలకూ మధ్య వైరుధ్యం ఉందని బీజేపీ పెద్దలు భావించడం లేదు. బహుళజాతి, స్వదేశీ కార్పొరేట్లకు దేశ వనరులను దోచిపెట్టే కార్యక్రమం ప్రభుత్వ మార్పిడి తర్వాత ఆగలేదు.
ఆగుతుందన్న పిచ్చి భ్రమ ఎవరికీ లేదు కూడా. ఈ క్రమంలో తీవ్రంగా నష్టపోయేది చిన్న, సన్నకారు రైతులు, రైతు కూలీలు, కార్మికులు పట్టణాలలో పోగుపడుతున్న కోట్లాది అసంఘటిత రంగం కార్మికుల వంటి నోరూవాయి లేని వర్గాలు. ఉదారవాద ఆర్థిక విధానాల వల్ల ప్రభావితం అయ్యేవారిలో ఎక్కువమంది దళితులు, క్షీణిస్తున్న చేతి వృత్తులపై ఆధారపడే వెనుకబడిన వర్గాలు వారు. ఈ వర్గాలు హక్కుల కోసం పోరాడడం అంటే కార్పొరేటీకరణను వ్యతిరేకించడమే. కాబట్టి మత ప్రాతిపదిక రాజకీయాలు ఉభయతారకంగా ఉపయోగపడతాయని బీజేపీ భావిస్తోంది.
వామపక్షాల బలం క్షీణించకుండా ఉంటే బీజేపీ నడకలో ఇంత తెంపరితనం కనబడేది కాదేమో! వామపక్షాల బలం గత పదేళ్ళలో గణనీయంగా తగ్గిపోయింది. 14వ లోక్‌సభలో 59మంది లోక్‌సభ సభ్యులున్న వామపక్షాల బలం 2009 ఎన్నికల్లో 24కు పడిపోయింది. 2014 ఎన్నికలకు వచ్చేసరికి 11కు క్షీణించింది. ఈ పరిణామాలకు కారణాలు వెతకడానికి ఇది సందర్భం కాదు. కానీ వామపక్షాలలో లోతైన ఆత్మవిమర్శ అవసరం ఎంతైనా ఉందని చెప్పక తప్పదు. సైద్ధాంతికంగా వామపక్షాలతో విభేదించే ప్రజాస్వామిక వాదులు కూడా దేశంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో వామపక్షాల ఉనికి ఇంకాస్త బలంగా ఉంటే బావుండునని అనుకుంటారంటే అందులో విడ్డూరం లేదు.
సరైన రాజకీయ ప్రతిఘటనలేని ఇలాంటి వాతావరణంలో మెజారిటీ మత రాజకీయాలు నడిపే శక్తులు ఎలాంటి ఎత్తులైనా వేయగలవు. స్వతంత్ర భారతంలో ప్రజాస్వామిక, సెక్యులర్‌ రాజకీయాల స్ఫూర్తికి ప్రాణంపోసిన జవహర్‌లాల్‌ నెహ్రూను పూచికపుల్లకింద తీసిపారేయగలవు; నిజాయితీ, నీతి నియమాలకు నిలువెత్తు దర్పణమైన పరిపాలనా దక్షుడు వల్లభ్‌భాయ్‌ పటేల్‌ను హిందుత్వ మార్క్‌ జాతీయవాదిగా చిత్రీకరించేందుకు తెగబడగలవు; అనునిత్యం మహాత్మాగాంధీ నామజపం చేస్తూనే, ప్రజల స్వేచ్ఛా స్వాతంత్ర్యాలను హరించే నిరంకుశ చట్టంగా ఆయన అభివర్ణించిన దేశద్రోహ చట్టం కింద ఒక విద్యార్థిని నిర్బంధించగలవు; దళితుల గుండెల్లో అఖండ జ్యోతిగా వెలుగొందుతున్న అంబేద్కర్‌ను సొంతం చేసుకునే ప్రయత్నాలు సాగిస్తూనే ఆ దళితుల ఆహారపు అలవాట్లపై హిందుత్వ అజెండాను రుద్దగలవు. తాము నిర్ణయించిన విలువలకు విరుద్ధంగా ఎవరైనా నడిస్తే వారి మెడలో దేశద్రోహి, జాతి విద్రోహి అన్న బిళ్లలు వేలాడదీయడమే. ఈ విషయంలో ‘దేశభక్తు’లయిన బీజేపీ నాయకులు ఎలాంటి విమర్శకయినా వెనుదీయరు.
www.kodali. blogspot.com
జేఎన్‌యూ ఉదంతంలో కన్నయ్యకు మద్దతు పలికిన వారిపై బీజేపీ నాయకులు ఎక్కుపెట్టిన ఒక విమర్శ: ‘సియాచిన్‌లో వీర సైనికులు దేశం కోసం ప్రాణాలు అర్పిస్తుంటే ఇక్కడి వీరు అఫ్జల్‌గురు, మెమన్‌ వంటి టెర్రరిస్టులను ఆరాధిస్తున్నారు’. ప్రజాస్వామ్యంలో ఎటువంటి సెంటిమెంట్‌ రగల్చడానికి చేసే ప్రయత్నం ఇది? సియాచిన్‌ హిమపాతంలో జవానులు అసువులు బాసిన దానికీ, జేఎన్‌యూలో అఫ్జల్‌ గురు ఉరి నిరసన లకూ మధ్య ఏమిటి లంకె? జమ్మూ కాశ్మీర్‌ భారతలో అంతర్భాగం అని అంగీకరిస్తూనే అక్కడిసైన్యం మానవ హక్కుల ఉల్లంఘనలను ప్రశ్నించడం సాధ్యం కాదా? టెర్రరిజాన్ని వ్యతిరేకిస్తూనే అఫ్జల్‌ గురూ, యాకూబ్‌ మెమన్‌ ఉరిని నిరసించడం సాధ్యం కాదా? ఇదేం దేశభక్తి? బీజేపీ మార్కు దేశభక్తిని చూస్తే బ్రిటిష్‌ మేధావి, విమర్శకుడు శామ్యూల్‌ జాన్సన్‌ ‘దుష్టులు చివరికి దేశభక్తిని ఆశ్రయిస్తారు’ అన్నమాట జ్ఞాపకం వస్తోంది. 
-ఆలపాటి సురేశ్‌ కుమార్‌ 
జర్నలిస్టు