24, ఫిబ్రవరి 2016, బుధవారం

jnu incident andrajyothi artical.aginest left partys

జవహర్‌లాల్‌ నెహ్రూ విశ్వవిద్యాలయంలోని వామపక్ష విద్యార్థి సంఘాలకు పలు అంతర్గత, బహిరంగ జాతి వ్యతిరేక శక్తులు సహాయ సహకారాలను అందిస్తున్నాయని ఒక ఆరోపణ. దీనిని భారత దేశం పట్ల అంతర్జాతీయ కుట్రలో భాగంగానే అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది.

దేశంలోని ప్రతిష్టాత్మక జవహర్‌ లాల్‌ నెహ్రు విశ్వవిద్యాలయం గత పక్షంరోజులుగా రాజకీయ నాయకులకు, మీడియా మిత్రులకు, స్వచ్ఛంద సంస్థలకు, సాధారణ ప్రజానీకానికి ప్రధాన చర్చనీయాంశం. ఇందుకు కారణం అందరికీ వారివారి పద్ధతులలో తెలిసినదే. ఒకరు భారత రాజ్యాంగం ప్రసాదించిన భావ ప్రకటనా స్వేచ్ఛను భారత కేంద్ర ప్రభుత్వం హరిస్తుందని వాదిస్తుంటే... దేశ వ్యతిరేక చర్యలు సహించేది లేదని మరొకరు. ఇంతకీ జేఎనయూలో ఏమి జరిగింది? ఎందుకు ఇంత పెద్ద చర్చకు దారితీసింది అనేది మౌలిక ప్రశ్న? 
               ఉమర్‌ ఖలీద్‌ (జేఎనయూలో పీహెచడీ విద్యార్ధి), అతని మిత్రులు కలిసి ఫిబ్రవరి 9 సాయంత్రానికి సాంస్కృతిక పండుగ ‘‘కల్చరల్‌ ఫెస్టివల్‌’’ పేరుతో విశ్వవిద్యాలయ అధికారుల నుంచి అనుమతి పొంది తమ కార్యక్రమానికి సిద్ధమైన తరుణంలో జేఎనయూఎ్‌సయూ సంయుక్త కార్యదర్శి సౌరబ్‌ కుమార్‌ శర్మ కల్చరల్‌ ఫెస్టివల్‌ పేరుతో దేశ వ్యతిరేక కార్యక్రమాలకు పన్నాగం పన్నారని, వారి కార్యక్రమ అనుమతిని రద్దు చేయమని లిఖిత పూర్వకంగా కోరడంతో విశ్వవిద్యాలయ అధికారులు తమ అనుమతిని వెనక్కి తీసుకున్నారు. అయినప్పటికీ ఆ విద్యార్థులు విశ్వవిద్యాలయ అధికారులను సవాలు చేస్తూ తమ కార్యక్రమాన్ని నిర్వహించారు. యూనివర్సిటీ అధికార యంత్రాంగం ఆ కార్యక్రమాన్ని వీడియో తీసింది. అందులో ఉమర్‌ ఖలీద్‌ అతని అనుచర గణం సబర్మతి హాస్టల్‌ ముందు దేశ వ్యతిరేక నినాదాలు చేయడం ద్వారా జేఎనయూ దేశ ప్రజలను ఆకర్షించింది. జేఎనయూఎ్‌సయూ అధ్యక్షుడు కన్నయ్య కుమార్‌ అదే సమయంలో ఉమర్‌ ఖలీద్‌ ప్రక్కన.... ‘ఆజాదీ’ అని నినాదాలిస్తూ వీడియోకు పట్టుపడడంతో ఉమర్‌ ఖలీద్‌తో సహా కన్నయ్య కుమార్‌, డి.అర్పిత (డి.రాజా కూతురు), మరో ఐదు మందిపై దేశ ద్రోహ చట్టం కింద ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేసారు. అందులో కన్నయ్య కుమార్‌ పోలీసుల చేతికి చిక్కగా మిగిలిన వారు పరారీలో ఉన్నారు. కన్నయ్య కుమార్‌ తన కేసును తనే వాదించుకుంటూ ఆజాదీ కావాలని నినదించింది పేదరికానికి వ్యతిరేకంగా, నిరక్షరాస్యతకు వ్యతిరేకంగా అని సమర్థించుకొన్నాడు.
                       కానీ దీనికంటే ముందుగా గత రెండు దశాబ్దాలుగా బీఎ్‌సఎఫ్‌ జవాన్లకు, సీఆర్పీఎఫ్‌ జవాన్లకు వ్యతిరేకంగా, తీవ్రవాదులకు మద్దతుగా, నక్సల్‌ వాదులకు మద్దతుగా కాశ్మీర్‌ లిబరేషన్‌ పేరుతో, స్వేచ్ఛ పేరుతో ఎన్నో సెమినార్లు, వర్క్‌ షాప్‌లు, డిస్కషన్లు నిర్వహిస్తున్నారు. డీఎ్‌సయూ (డెమోక్రటిక్‌ స్టూడెంట్స్‌ యూనియన) తన కరపత్రంలో బీఎ్‌సఎఫ్‌ జవాన్లను ఉద్దేశిస్తూ ‘ఇండియన్‌ డాగ్స్‌... గో బ్యాక్‌’ అంటూ రాయడం జరిగింది. అంతేకాదు ఏఐఎస్‌ఏ అనే విద్యార్ధి సంఘం జేఎనయూ లైబ్రరీ గోడపై ‘ఫ్రీడమ్‌ ఫర్‌ కాశ్మీర్‌, నాగాలాండ్‌, మణిపూర్‌, అస్సాం, పాలస్తీనా’ అని రాయడం జరిగింది. ఇంత బహిరంగంగా దేశ వ్యతిరేక కార్యక్రమాల నిర్వహణకు కావలసిన శక్తి జేఎనయూ వామపక్ష విద్యార్థి సంఘాలకు ఫిబ్రవరి 9 అఫ్జల్‌ గురు ఉరితీత ద్వారానే రాలేదు. గత కొన్ని సంవత్సరాలుగా స్వేచ్ఛ, స్వాతంత్య్రం పేరుతో పేదరికం, మహిళా సాధికారత ముసుగున జేఎనయూలో చేసే చర్చల ద్వారానే, ఫ్రీడమ్‌ ఆఫ్‌ స్పీచ్‌, ఫ్రీడమ్‌ ఆఫ్‌ ఎక్స్‌ప్రెషన్‌ పేరున సమకూరిందనేది కాదనలేని సత్యం. అందుకు ఎన్నో అంతర్గత, బహిరంగ జాతి వ్యతిరేక శక్తులు సహాయ సహకారాలను అందిస్తున్నాయని ఒక ఆరోపణ. కాబట్టి దీనిని భారత దేశం పట్ల అంతర్జాతీయ కుట్రలో భాగంగానే అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది.
               విశేషమేమిటంటే ఈ విషయం జేఎన్‌యూ వాతావరణానికి ఎంతమాత్రం కొత్త కాదు. ఏబీవీపీ ఈ కార్యక్రమాన్ని గతం నుంచి వ్యతిరేకిస్తోంది. కానీ ఈ సారి వారు సౌరబ్‌ కుమార్‌ శర్మ, అతని ఏబీవీపీ మిత్రులపై దాడి చేసిన సన్నివేశాలు, జాతి వ్యతిరేక నినాదాలతో కూడిన కార్యక్రామాన్ని వీడియో తీయడంతో వామపక్ష విద్యార్థి సంస్థల బండారం యావత్‌ భారతానికి తెలిసింది. దేశ వ్యతిరేక నినాదాలతో కూడిన ఆ వీడియో మీడియా చేతికి అందడంతో జేఎనయూ ప్రతిష్ట మసకబారింది.
            ‘పాకిస్థాన్‌ జిందాబాద్‌.... ఇండియా ముర్దాబాద్‌’ / ‘భారత్‌ కి బర్బాతి తక్‌... జంగ్‌ రహేంగే జంగ్‌ రహేంగే’ (భారత దేశాన్ని ముక్కలు అయ్యేంత వరకు పోరాడుతాం... పోరాడుతాం) / ‘భారత్‌ కో హజార్‌ తుక్డా కరో.... ఇన్ష అల్లాహ్‌ ఇన్ష అల్లాహ్‌’ (భారత్‌ను వెయ్యి ముక్కలు చేయి... అల్లాహ్‌ ఆశీర్వాదం ఉంటుంది) / ‘కిత్న అఫ్జల్‌ కో మరోన్గే.... ఉత్న అఫ్జాల్‌ నికలేగా’ (ఎంత మంది అఫ్జల్‌ గురులను చంపితే అంతమంది అఫ్జల్‌లు పుడతారు) / ‘కిత్న అఫ్జల్‌ కో మరోన్గే.... హర్‌ ఘర్‌ సే అఫ్జల్‌ నికలేగా’ (ఎంత మంది అఫ్జల్‌ గురులను చంపుతావు.. ప్రతి ఇంటినుంచి అఫ్జల్‌లు పుడతారు) / ‘కాశ్మీర్‌ కో ఆజాద్‌ దో.... భారత్‌ కో బర్బాత్‌ కరో’ / ‘హం మాంగే ఆజాద్‌... కేరళ్‌ కో’ (కేరళకు ప్రత్యేక దేశంగా స్వాతంత్య్రం కోరుతాం) / ‘హం మాంగే ఆజాద్‌.... బంగాల్‌ కో’ (బెంగాల్‌కు ప్రత్యేక దేశంగా స్వాతంత్య్రం కోరుతాం) / ‘హం మాంగే ఆజాద్‌... అస్సాం కో’ (అస్సాంకు ప్రత్యేక దేశంగా స్వాతంత్య్రం కోరుతాం)...ఇలా కొనసాగాయి వారి జాతి వ్యతిరేక నినాదాలు. సాధారణ జేఎనయూ విద్యార్థులకు ఇవి ప్రతి సంవత్సరంలా షరా మాములే. తిరిగి ప్రశ్నించలేని పరిస్థితి. ఎందుకంటే ప్రశ్నిస్తే ఆర్‌ఎ్‌సఎస్‌, ఏబీవీపీ అని ముద్ర వేసి పరీక్షలలో ఫెయిల్‌ చేస్తారనే భయం.
              ఇంత జరిగినా యూనివర్సిటీ అధికారుల చర్యలతో సద్దుమణుగుతుందనుకున్న ఈ విషయం రాహుల్‌ గాంధీ, డి.రాజా గార్ల పరామర్శతో ఒక్కసారిగా యూనివర్సిటీ వాతావరణం వేడెక్కింది. రాజకీయ నాయకుల ప్రధాన చర్చలకు దారితీసింది. డి.రాజా గారు పాపం తన కుమార్తెను దేశద్రోహ చట్టం నుంచి రక్షించుకోవాలనే తాపత్రయంతో యూనివర్సిటీని సందర్శించగా... రాహుల్‌ గాంధీ కేంద్ర ప్రభుత్వ చర్యలను విమర్శించి విద్యార్థుల మన్నన పొందాలనే ప్రయత్నంతో అభాసు పాలయ్యారు.
                 వాద ప్రతివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. చర్యకు ప్రతి చర్యలు జరుగుతూనే ఉన్నాయి. విశ్వవిద్యాలయానికి వ్యతిరేకంగా ఎన్నోసంస్థలు జేఎనయూ నుంచి దేశ ద్రోహులను తరిమేయాలని వర్సిటీ ప్రధాన ద్వారం ముందు గత పది రోజులుగా నిరసన వ్యక్తం చేస్తూనే ఉన్నాయి. మొదటిసారిగా కమ్యూనిస్టు భావజాలాన్ని సాధారణ ప్రజానీకం సైతం ప్రశ్నించడం ప్రారంభించింది ఇలా...
(1) కన్నయ్య కుమార్‌కు మద్దతుగా నిలిచిన వామపక్ష భావజాల రాజకీయ నాయకులు, అధ్యాపకులు అదే స్థాయిలో దేశద్రోహకర నినాదాలు చేసిన విద్యార్థులను శిక్షించాలని ఎందుకు ప్రశ్నించడం లేదు? (2) దంతేవాడలో నక్షలైట్ల చేతిలో చనిపోయిన 70 మంది పోలీసులకు శ్రద్ధాంజలి ఘటించాల్సింది పోయి జేఎనయూలో వామపక్ష విద్యార్ధి సంఘాలు ఎందుకు సంబరాలు చేసుకున్నారు? (3) నిరంతరం మహిళా స్వాతంత్య్రం గురించి మాట్లాడే కమ్యూనిస్టులు బంగ్లాదేశీ మైనార్టీ (హిందూ) యువతిపై ఒక పైశాచిక అధ్యాపకుడు అర్షద్‌ ఆలం అత్యాచారం చేసి పట్టుపడడంతో యూనివర్సిటీ అధికారులు అతనిని విధుల నుంచి సస్పెండ్‌ చేశారు. దీనిపై కమ్యూనిస్టు భావజాల అధ్యాపకులు ప్రశ్నించలేదు సరికదా అతనికి మద్దతుగా ఎందుకు నిలిచారు? ప్రతి సంఘటనకు ఉద్యమం చేసే వామపక్షాలు అతనికి వ్యతిరేకంగా ఎందుకుమాట్లాడలేదు? 
(4) స్వేచ్ఛ, విముక్తి, బానిసత్వం, పేదరికం, అంటరానితనం, మూఢనమ్మకాలు పేరుతో వీరుచేసే ఉద్యమాల మాటున ఎందుకు దేశ వ్యతిరేక నినాదాలు ఉద్భవిస్తున్నాయి? వీటిని ఫ్రీడమ్‌ ఆఫ్‌ స్పీచ్‌ పేరుతో ఎందుకు సమర్థించుకుంటున్నారు? (5) ఫిబ్రవరి 9న సబర్మతి హాస్టల్‌ ముందు దేశ వ్యతిరేక నినాదాలు చేస్తూ వీడియోకి పట్టుబడిన వారికి బుద్ధి చెప్పాల్సింది పోయి, అదే వీడియోను ఎడిట్‌ చేసి ఆ నినాదాలు చేసింది ఏబీవీపీ విద్యార్థులు అని ప్రచారం చేసే అగత్యం వామపక్ష అధ్యాపకులకు ఎందుకు దాపురించింది? (6) రాజ్యాంగాన్ని సంరక్షిస్తూ, రాజ్యాంగ విలువలతో నడుచుకుంటున్న భారత అత్యున్నత న్యాయస్థానం భారత పార్లమెంటుపై దాడిచేసిన అఫ్జల్‌ గురుకు మరణ దండన విధిస్తే ఆ తీర్పును ఎందుకు ప్రశ్నిస్తున్నారు?
            పార్లమెంటుపై దాడిని ఎదిరిస్తూ మరణించిన వీర సైనికుల బలిదానాలను ఎందుకు అపహాస్యం చేస్తున్నారు? (7) వామపక్ష నాయకులకు, విద్యార్థులకు, అధ్యాపకులకు నిజంగానే రాజ్యాంగం పట్ల నమ్మకం ఉందా? లేక నటిస్తున్నారా? నిజంగానే నమ్మకం ఉంటే భారత అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీం కోర్టు తీర్పును ఎందుకు గౌరవించడం లేదు? (8) ప్రతి సంవత్సరం అఫ్జల్‌ గురు, యాకుబ్‌ మాలిక్‌ లాంటి దేశద్రోహులను స్మరించుకునేందుకు కారణాలు వెదికే వీరికి ఏ ఒక్క రోజైనా దేశం కోసం ప్రాణాలర్పించిన భారత జవాన్లను సంస్మరించుకునేందుకు కారణాలు ఎందుకు దొరకడం లేదు? (9) ఫిబ్రవరి 9న దేశ రక్షణ కోసం సియాచిన్‌ గ్లేసియర్‌ మంచు కొండల్లో మరణించిన లాల్‌ నాయక్‌ హనుమంతప్పకు యావత్‌ భారతం శ్రద్ధాంజలి ఘటిస్తుంటే.... జేఎనయూలో ఎందుకు అఫ్జల్‌ గురును స్మరిస్తున్నారు?
             జేఎన్ యూలో వెంటనే సాధారణ పరిస్థితులు నెలకొల్పాల్సిన కర్తవ్యం ప్రధానంగా అధ్యాపకులు, విద్యార్థులపై ఉంది. సంఘ విద్రోహ శక్తులను చట్టానికి అప్పగించి తిరిగి యూనివర్సిటీలో సాధారణ పరిస్థితులను నెలకొల్పి యువతను అధ్యయనం, పరిశోధన వైపు నడిపించాల్సిన ప్రధాన బాధ్యత జేఎనయూ అధ్యాపకులదే. యూనివర్సిటీ పాలక యంత్రాంగం వెంటనే స్పందించి రాజకీయ నాయకులను క్యాంపస్‌లోపలికి రాకుండా నిరోధించి విద్యార్థులను దేశ సమస్యలపై పరిశోధన చేసే మానవ వనరులుగా తీర్చిదిద్దాలి. భావి భారత పౌరులుగా తీర్చిదిద్దాలి.
డా. లింగమూర్తి 

ఆర్థిక, రాజకీయ విశ్లేషకులు, న్యూఢిల్లీ

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి